Karnataka Yeswanthpur: Naming Ceremony Father Dies In Road Accident - Sakshi
Sakshi News home page

బిడ్డకు పేరుపెట్టే సంబురం.. వెనుకనుంచి కాటేసిన మృత్యువు

Oct 20 2022 1:49 PM | Updated on Oct 20 2022 5:27 PM

Knataka Yeswanthpur: Naming Ceremony Father Dies In Road Accident - Sakshi

పుట్టిన బిడ్డకు పేరు పెట్టే సంబురంలో మునిగిన తండ్రిని మృత్యువు యాక్సిడెంట్‌ రూపంలో కాటేసింది.

యశవంతపుర: కుమారుడి నామకరణం కోసం ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. వేడుకకు అవసరమయ్యే సరుకుల కోసం వెళ్లిన చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

కర్ణాటక కలబురిగి జిల్లా జీవర్గి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. హరనూరు గ్రామానిచి చెందిన బసలింగప్ప(28) ఈ మధ్యే బిడ్డ పుట్టాడు. కుమారుడికి బుధవారం నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సరుకుల కోసం బసలింగప్ప, బంధువు మహంతయ్య(60)లు బైకుపై జీవర్గికి వెళ్తుండగా వెనుకనుంచి బస్సు ఢీకొంది. 

ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ బస్సును వదిలేసి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి: వీడసలు భర్తేనా?.. తండ్రిగా కూడా ఘోరం అసలు

Advertisement
 
Advertisement
Advertisement