సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు

Karthi Chidambaram Comments On Congress Party - Sakshi

చెన్నై: కాంగ్రెస్‌ పార్టీ వర్గాలపై అదే పార్టీకి చెందిన జాతీయ నేత పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తీవ్రంగా విరుచుకుపడడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్‌ వాళ్లు అబద్ధాల కోరులు.. ఆపండి మీ అబద్ధాలు అని ఆయన రామనాథపురం వేదికగా ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. రామనాథపురం జిల్లా పరమకుడిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో కార్తీ చిదంబరం తన పార్టీ వాళ్ల మీదే తీవ్రంగానే మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సభ్యత్వం 70 లక్షలు అంటా.. ఇది పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు. ( కాం‍గ్రెస్‌లో సంక్షోభం‌: సీఎం రాజీనామా..!)

ఈ మేరకు సభ్యులు ఉండి ఉంటే, ఎందుకు ఓటింగ్‌ శాతం తగ్గినట్టో అని ప్రశ్నించారు. సభ్యుల్ని పెంచి చూపించాలని, ఏదో మొక్కుబడిగా నివేదికలు, చిట్టాలు సిద్ధం చేసి ఢిల్లీకి పంపించేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ పేపర్లు అక్కడి వాళ్లకు బటానీలను పెట్టుకుని తినేందుకు ఉపయోగపడుతున్నట్టు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ఇకనైనా నిజాలు చెబితే మంచిదని హితవు పలికారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top