
న్యూఢిల్లీ: అంతరిక్షం గురించి క్షేత్రస్థాయలో నేర్చుకునే దానికన్నా తనకు అందిన అనుభవం భిన్నమైనదని, అంతరిక్షయానం అనేది యావత్ దేశ లక్ష్యమని వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు. అంతరిక్షయానాన్ని విజయవంతంగా పూర్తిచేసి, భారత్ చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లాకు యావత్ ప్రపంచం నుంచి అభినందనలు అందుతున్నాయి.
ఈ నేపధ్యంలో న్యూఢిల్లీలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశం అంతరిక్ష సామర్థ్యాలను మరింతగా పెంపొందించుకుంటున్నదని, ఆక్సియం-4 మిషన్పై మరింతగా దృష్టిసారించదని నారాయణన్ అన్నారు. శుక్లా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నేర్చుకునే దానికంటే తాను అందుకున్న అనుభవం చాలా భిన్నంగా ఉన్నదన్నారు. భారత ప్రభుత్వానికి, ఇస్రోకు, పరిశోధకులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
Met with the Hon PM today. Last time I spoke to him virtually was from Orbit with this same flag in the background on the @iss. I cannot describe how proud I felt that day representing Bharat and today when I was speaking to the PM @narendramodi Like I said this is just the first… pic.twitter.com/TsKGZmG8Ya
— Shubhanshu Shukla (@gagan_shux) August 18, 2025
2015 నుండి 2025 వరకు ఇస్రో చేపట్టిన మిషన్ల కంటే 2005 - 2015 మధ్య కాలంలో చేపట్టిన మిషన్లు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని డాక్టర్ నారాయణన్ అన్నారు. గత ఆరు నెలల్లో మూడు కీలక మిషన్లను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆక్సియం-4 మిషన్ ప్రతిష్టాత్మకమైన మిషన్ అని, మొదటి భారతీయుడిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళి, సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిందన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు శుభాంశు శుక్లా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. సోమవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.