మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident On Malabar Express - Sakshi

సాక్షి, కేరళ: తిరువనంతపురం జిల్లాలో మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌ లగేజ్‌ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ప్రయాణికులు గుర్తించి గార్డుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top