సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం​ | Election Speech Actor Mithun Chakraborty Questioned By Kolkata Police | Sakshi
Sakshi News home page

సినిమా డైలాగులతో రెచ్చగొట్టాడు!.. పోలీసుల ప్రశ్నల వర్షం

Jun 16 2021 12:03 PM | Updated on Jun 16 2021 6:29 PM

Election Speech Actor Mithun Chakraborty Questioned By Kolkata Police - Sakshi

కోల్‌కతా: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, బెంగాల్‌ బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్‌ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్‌ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

కాగా, 71 ఏళ్ల మిథున్‌ చక్రవర్తి.. బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా,  బెంగాల్‌ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్‌ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్‌ కోల్‌కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా.  అయితే  కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్‌గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్‌ పుట్టినరోజు ఇవాళే. 

చదవండి: మిథున్‌ కొడుకుపై రేప్‌ కేస్‌

Advertisement
 
Advertisement
Advertisement