
ఢిల్లీ: ఏపీ రాష్ట్రంలోని తెనాలి పట్టణంలో దళిత, మైనార్టీలకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కొట్టడం దారుణమన్నారు సీడబ్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. ఇది రాజ్య హింస కిందకే వస్తుందని మండిపడ్డారు. ఏపీలో నడిరోడ్డుపై యువకులను దారుణంగా కొట్టడం కచ్చితంగా రాజ్య హింసేనని, ఏపీలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పోలీసులు చట్టబద్ధం వ్యవహరించాలని, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగిసిందని సెటైర్లు వేశారు గిడుగు రుద్రరాజు. ఇక నుంచైనా పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెడితే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై మహానాడులో తీర్మానం చేయాలన్నారు. సంబరాలపై కాకుండా పథకాల అమలుపై చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చూస్తే చంద్రబాబు పథకాల అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.