దేశంలో 92 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,22,217కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా 481 కరోనా మరణాలు
ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 37,816 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,42,771కు చేరింది. కాగా కొత్తగా 481 కోవిడ్ మరణాలు సంభవించడంతో భారత్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,34,699కు చేరుకుంది.