రైతులకు రుణ పథకం పొడిగింపు | Cheaper Kisan Credit Card loans to continue | Sakshi
Sakshi News home page

రైతులకు రుణ పథకం పొడిగింపు

May 29 2025 2:22 AM | Updated on May 29 2025 2:22 AM

Cheaper Kisan Credit Card loans to continue

న్యూఢిల్లీ: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల(కేసీసీ) ద్వారా తక్కువ కాలవ్యవధికి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేసేందుకు ఉద్దేశించిన మాడిఫైడ్‌ ఇంటరెస్ట్‌ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌(ఎంఐఎస్‌ఎస్‌)ను 2025–26లోనూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయించింది. ఈ పథకం కింద 7 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తారు. ఇందులో 1.5 శాతం వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే వడ్డీపై 3 శాతం వరకు రాయితీ లభిస్తుంది.

 అంటే రైతులకు దాదాపు 4 శాతం వడ్డీకే రుణం లభిస్తుందని చెప్పొచ్చు. ఈ పథకం కొనసాగింపు వల్ల ఖజానాపై రూ.15,640 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఎంఐఎస్‌ఎస్‌ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. కేసీసీ ద్వారా రైతులు రూ.3 లక్షల దాకా రుణం పొందవచ్చు. పాడి పశువులు, చేపల పెంపకం కోసం ఈ సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలో 7.75 కోట్లకుపైగా కేసీసీ ఖాతాలు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement