
భరత్ భవితవ్యంపై బెంగ..
సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి రాములు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్ప్రసాద్ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలో చేరి.. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. రానున్న కాలంలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో ఉన్నారు. అయితే గులాబీ పార్టీలో గువ్వలలో అంతర్గత పోరులో భాగంగా బీజేపీలో చేరితే.. ఇప్పుడు మళ్లీ గువ్వల రూపంలోనే పోటీ ఎదురవుతోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన రాములు కార్యక్షేత్రంపైనే ఆయన తనయుడు భరత్ ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్లో ఉండగా జెడ్పీ చైర్మన్ పదవి, అచ్చంపేట ఎమ్మెల్యే సీటు, నాగర్కర్నూల్ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ప్రధానంగా గులాబీ పార్టీలో గువ్వల బాలరాజు ప్రభావంతో తమకు అవకాశాలు దక్కలేదని భరత్ప్రసాద్ భావించారు. ఈ కారణాలతోనే రాములు సైతం కుమారుడితో కలసి పార్టీని వీడి అనూహ్యంగా బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు గువ్వల సైతం బీజేపీలోనే చేరుతుండటంతో భరత్ప్రసాద్ భవితవ్యంపై వారి అనుచరులు బెంగ పెట్టుకుంటున్నారు.

భరత్ భవితవ్యంపై బెంగ..

భరత్ భవితవ్యంపై బెంగ..