మలేరియాను ప్రారంభదశలో గుర్తించి చికిత్స అందిస్తే మేలు. నిర్లక్ష్యం చేస్తే అది ప్లీహము, కిడ్నీ, కాలేయం, మెదడు, రక్తకణాలను దెబ్బతీసి ప్రాణాంతకం చేస్తుంది. తీవ్ర తలనొప్పి, తీవ్ర చలిజ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. మలేరియా వ్యాధి నిర్ధారణ కాకపోయినా లక్షణాలు అవే ఉంటే అందుకు అనుగుణంగా చికిత్స అందించి ఇతర అవయవాలు దెబ్బతినకుండా కాపాడే అవకాశం ఉంది.
–డాక్టర్ ఎం.మహేశ్వరరెడ్డి, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు


