
వీధి కుక్కల దాడిలో 12 మందికి గాయాలు
పత్తికొండ: వీధి కుక్కల దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన చాకలి అయ్యమ్మ అనే మహిళ పని నిమి త్తం పత్తికొండకు వచ్చారు. ఆమెతోపాటు మరో 11 మంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడే ఉన్న వీధి కుక్కలు దాడి చేశాయి. అక్కడ ఉన్న స్థానికులు గమనించి కుక్కలను తరిమారు. గాయపడిన వారిని వైద్య చికిత్సల నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పత్తికొండ పట్టణంలోని అన్ని కాలనీల్లో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని వాటిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.