ఈ నెలా.. ఎగనామమే! | - | Sakshi
Sakshi News home page

ఈ నెలా.. ఎగనామమే!

Aug 4 2025 4:21 AM | Updated on Aug 4 2025 4:21 AM

ఈ నెల

ఈ నెలా.. ఎగనామమే!

● బదిలీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు లేవు ● ఇప్పటికీ కేటాయించనిపొజిషన్‌ ఐడీలు ● జిల్లాలో దాదాపు 600 మంది ఉపాధ్యాయుల ఆందోళన

ప్రభుత్వం విఫలం

బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక నెల జీతాలు చెల్లించలేదంటే సాంకేతిక లోపమో, పని ఒత్తిడో అని సరిపెట్టుకోవచ్చు. కానీ రెండు నెలల జీతాలు ఆపడం అంటే సీఎస్‌ఈ నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సకాలంలో బిల్లులు చేసి జీతాలు చెల్లించాలి. – నగరి శ్రీనివాసులు,

1938 జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల

ఉపాధ్యాయులపై కక్ష

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. బోధనేతర పనులు అప్పగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. అనేక రకాల లక్ష్యాలు, యాప్‌ అప్‌లోడ్‌ వంటి పనులు అప్పగించడం వారిని అవమానించడానికే. జీతాల చెల్లింపులో అలసత్వంపై ఉపాధ్యాయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

– శివయ్య, ఫ్యాప్టో చైర్మన్‌, నంద్యాల

నంద్యాల(న్యూటౌన్‌): అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పరిపాలనలో చేతులేత్తేస్తోంది. బదిలీ ఉపాధ్యాయులకు ఈ నెలా మొండిచేయి చూపింది. టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం బదిలీలు అయిన ఉపాధ్యాయులకు మాత్రం జీతాల చెల్లింపులో పూర్తిగా విఫలమైంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినా సర్కారులో చలనం లేదు. ఈనెల 1వ తేదీన జీతాలు వస్తాయని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు భంగపాటు మిగిలింది. సాధారణంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించాలి. దీని నిమిత్తం పాజిషన్‌ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపు అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలో దాదాపు 600 మందికి పైగా స్థానచలనం కలిగింది. బదిలీలు పూర్తి చేసి నెల రోజులు దాటుతున్నా క్లియర్‌ వేకెన్సీల్లోకి బదిలీ అయిన వారికి మాత్రమే పాజిషన్‌ ఐడీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించిన పీఎస్‌ హెచ్‌ఎం, రీపోర్షన్‌మెంట్‌ కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటికీ పొజిషన్‌ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఆగస్టు నెలలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు.

వచ్చే నెలా అనుమానమే..

ఉపాధ్యాయులను బదిలీ చేసిన తర్వాత కేడర్‌ స్ట్రెంగు నిర్ధారించి ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీ అండ్‌ ఆడిట్‌కు అందించాలి. అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు. కేడర్‌ స్ట్రెంగ్‌ అయిన తర్వాతే ఉపాధ్యాయులకు పొజిషన్‌ ఐడీలు కేటా యించే అవకాశం ఉంది. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జూన్‌, జూలై నెలలకు సంబంధించి జీతా లు ఏరియర్‌ బకాయిలతో ఈనెల 10వ తేదీలోపు ట్రెజరీకి బిల్లులు పెడితేనే ఈ నెలలో జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనెల 10లోపు ఈ ప్రక్రియ పూర్తికాకుంటే బదిలీ అయిన టీచర్లకు జూన్‌, జూలై తో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు కూడా సెప్టెంబర్‌లో పడే అవకాశం ఉండదని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

ఈ నెలా.. ఎగనామమే! 1
1/2

ఈ నెలా.. ఎగనామమే!

ఈ నెలా.. ఎగనామమే! 2
2/2

ఈ నెలా.. ఎగనామమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement