
‘షాక్’ ఇచ్చారు ఇలా..
● నంద్యాల జిల్లాలో ముందుగా నాన్ అగ్రికల్చర్ కనెక్ణ్(డీటీఆర్), ప్రభుత్వ సర్వీస్లు, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్లకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగించింది. 33కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడ ర్లకు స్మార్ట్ మీటర్లు బిగించలేదు.
● కొద్ది రోజులుగా 200 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగిస్తున్న గృహ కనెక్షన్లకు కూడా బిగిస్తున్నారు.
● మొత్తం 6,51,479 స్మార్ట్ మీటర్లు బిగించాలని తలపెట్టగా.. ఇప్పటికే 68,583 బిగించారు.
● 200 యూనిట్ల పైబడి వినియోగం ఉన్న ఇళ్లకు ఇప్పటి వరకు 4,219 స్మార్ట్ మీటర్లు బిగించారు.
● నంద్యాల డివిజన్లో 38,782, ఆత్మకూరు డివిజన్లో 11,507, డోన్ డివిజన్లో 18,294 స్మార్ట్ మీటర్లు బిగించారు.
ఇలా చేయవచ్చు..
● స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వినియోగదారులు వ్యతిరేకించవచ్చు.
● మీటర్లు వద్దని చెబుతున్నా...బిగించడానికి ప్రయత్నిస్తే 100 కాల్ చేసి పోలీసుల దృష్టికి తీసుకపోవచ్చు.
● ఇళ్లకు, షాపులకు బిగించడానికి వస్తే వద్దని ధైర్యంగా చెప్పవచ్చు.
● అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించే అధికారం విద్యుత్ శాఖకు లేదు.