సాధారణ కాన్పులో బాలభీముడు జననం | - | Sakshi
Sakshi News home page

సాధారణ కాన్పులో బాలభీముడు జననం

Mar 13 2025 11:38 AM | Updated on Mar 13 2025 11:33 AM

కోడుమూరు రూరల్‌: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళకు సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు గల పండంటి మగ శిశువు మంగళవారం రాత్రి జన్మించాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన సులోచన ప్రసవ నొప్పులతో మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్‌ పుష్పలత సాధారణ కాన్పు చేశారు. సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని ఈ బిడ్డ 4.25 కిలోలు ఉండటం అది కూడా సాధారణ కాన్పులో జన్మించడం విశేషమని వైద్యాధికారి డా.నాగరాజు తెలిపారు. సులోచనకు ఇది నాలుగో కాన్పు. అన్ని కూడా నార్మల్‌ డెలివరీలు కావడం గమనార్హం. ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు జన్మించడం పట్ల సులోచన, నారాయణ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement