మూసీకి 1604 క్యూసెక్కుల వరద | - | Sakshi
Sakshi News home page

మూసీకి 1604 క్యూసెక్కుల వరద

Jul 29 2025 4:35 AM | Updated on Jul 29 2025 9:07 AM

మూసీకి 1604 క్యూసెక్కుల వరద

మూసీకి 1604 క్యూసెక్కుల వరద

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. సోమవారం 1,604 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్‌ గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1,281 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా 643.20 మేర అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 549 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. గేట్ల ద్వారా, కాల్వలకు కలిపి మొత్తం 1904 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.99 టీఎంసీల నీరు ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు.

ఫ రెండు గేట్ల ద్వారా కొనసాగుతున్న

నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement