సాగర్‌కు పెరిగిన వరద | - | Sakshi
Sakshi News home page

సాగర్‌కు పెరిగిన వరద

Jul 23 2025 5:56 AM | Updated on Jul 23 2025 5:56 AM

సాగర్

సాగర్‌కు పెరిగిన వరద

నాగార్జునసాగర్‌ : కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సాగర్‌ జలాశయానికి వరద పెరిగింది. ఎగువన ఉన్న జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో అదనంగా వచ్చే నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం జలాశయ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలో ఉండడంతో ఒక క్రస్ట్‌గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదనతో కలిసి శ్రీశైలం నుంచి సాగర్‌కు 94,755 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో సాగర్‌ నీటిమట్టం 570.20 అడుగుల (257.0774 టీఎంసీలు)కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో సాగర్‌ జలాశయం నుంచి ఎడమ 2,608 క్యూసెక్కులు, విద్యుతుత్పాదనకు 2,627 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సాగర్‌కు పెరిగిన వరద1
1/1

సాగర్‌కు పెరిగిన వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement