ముగిసిన నెల్లిబండ గట్టు జాతర | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నెల్లిబండ గట్టు జాతర

May 22 2024 8:25 AM | Updated on May 22 2024 8:25 AM

ముగిసిన నెల్లిబండ గట్టు జాతర

ముగిసిన నెల్లిబండ గట్టు జాతర

నకిరేకల్‌: నకిరేకల్‌ మండలం నెల్లిబండ గ్రామంలోని గట్టుపై రెండు రోజులుగా కొనసాగుతున్న శ్రీలింగమంతుల స్వామి–సౌడమ్మ జాతర మంగళవారం రాత్రి ముగిసింది. సాయంత్రం 4:30 గంటలకు పసుపు కుంకుమలతో దేవుని పటం (చంద్రపట్నం) వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతరతో నెల్లిబండ గ్రామమంతా పండుగ వాతావరణం సందడి నెలకొంది. చివరి రోజు పూజల్లో ఆలయ చైర్మన్‌ యానాల యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ బోయిళ్ల కిషోర్‌, డెరెక్టర్లు బాత్క లింగస్వామి, ఆడెపు సతీష్‌, బోయిళ్ల అశ్విన్‌, గుడుగుంట్ల శివశంకర్‌, వీరబోయిన అబ్బయ్యల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement