కొల్లాపూర్ రూరల్: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో పర్యటించిన ఆయన మత్స్యకారులు ఆరాధ్యదైవం గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శ్రీవారి సముద్రం చెరువు పరిసరాల్లో గుడి నిర్మించేందుకు స్థలాన్ని చూశారు. త్వరలో గంగమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని, సింగోటం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమిడిశెట్టి వెంకటస్వామి, నాయకులు రామచంద్రారెడ్డి, రామస్వామి తదితర నాయకులు పాల్గోన్నారు.


