స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం, బోల యాదయ్య రచించిన హార్ట్బీట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పాలమూరు నగరంలోని తెలంగాణ చౌర స్తా వద్ద ఉన్న రెడ్క్రాస్ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వి.మనోహర్రెడ్డి, బెక్కెం జనార్దన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


