
సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
నాగర్కర్నూల్ రూరల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎర్రజెండా నీడలో సాగిందన్నారు. నిజాం నిరంకుశ పాల నకు వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ ప్రాంతా న్ని ఎర్రజెండా మయం చేసిన కామ్రేడ్ భీమి రెడ్డి, నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, మల్లు స్వరా జ్యం, అరుట్ల కమలాదేవి, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో నేతలు అమరులయ్యారని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని గుర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత, పొదిల రామయ్య, అశోక్, యాద య్య, వెంకటేశ్, కాశన్న, సత్యనారాయణ, రవి, మల్లికార్జున్, రాఘవేందర్, కృష్ణయ్య, వెంకటయ్య, బాలస్వామి పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర కృషి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు పోలీసు సిబ్బంది 24 గంటలపాటు సంసిద్ధంగా ఉంటున్నట్లు తెలిపారు. సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మహిళలు పూర్తి
ఆరోగ్యంగా ఉండాలి
నాగర్కర్నూల్ క్రైం: మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుందని.. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆరోగ్య సంరక్షణ కోసం ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకోవాలని సూచించారు. పూర్వం జొన్న, సజ్జ, రాగులు వంటి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండే వారని గుర్తుచేశారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తోందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహించే వైద్యశిబిరాల్లో మహిళలకు ఈఎన్టీ, నేత్ర, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము ఇతర క్యాన్సర్, రక్తహీనత, టెలిమానస్ సేవలు, సికిల్ సెల్ ఎనీమియా తదితర వైద్యపరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ పాల్గొన్నారు.
నిండుకుండలా
రామన్పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కు లు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు.