యూరియా కోసం పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం పడిగాపులు

Aug 30 2025 10:29 AM | Updated on Aug 30 2025 10:29 AM

యూరియా కోసం పడిగాపులు

యూరియా కోసం పడిగాపులు

ఉప్పునుంతల: మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ గోదాం వద్ద శుక్రవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. గురువారం యూరియా అందని రైతులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పీఏసీఎస్‌ వద్దకు చేరుకున్నారు. స్టాక్‌ ఉన్న 150 బస్తాలను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఆగ్రో రైతు సేవాల కేంద్రాలకు యూరియా సరఫరాను ఇచ్చిన అధికారులు ప్రస్తుతం కేవలం పీఏసీఎస్‌కు మాత్రమే ఇవ్వడంతో అవసరానికి సరిపడా యూరి యా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం 580 బస్తాలు రావడంతో రెండు రోజులపాటు రైతుకు రెండేసి బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశామని పీఏసీఎస్‌ సీఈఓ రవీందర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement