ర్యాలంపాడులో కదలిక | - | Sakshi
Sakshi News home page

ర్యాలంపాడులో కదలిక

Jul 12 2025 7:09 AM | Updated on Jul 12 2025 10:58 AM

ర్యాలంపాడులో కదలిక

ర్యాలంపాడులో కదలిక

సాగునీటి పారుదల శాఖ మంత్రి పర్యటనతో మరమ్మతు పనుల్లో చలనం

ర్యాలంపాడు జలాశయం ఆనకట్ట

గద్వాల: రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ర్యాలంపాడు సాగునీటి ప్రాజెక్టు కొందరు అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల వల్ల ప్రమాదంలో పడింది. అందుబాటులోకి వచ్చిన ఏడాది కాలంలోనే జలాశయం మొదలుకొని, కుడి, ఎడమ తూముల అడుగుభాగాల్లో ఏర్పడిన లీకేజీలతో రూ.కోట్ల ప్రజాధనం నీట కొట్టుకుపోతుంది. దీనిపై పలుమార్లు సర్వేలు, డీపీఆర్‌ నివేదికలు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు సమర్పించినా చలనం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో జలాశయాన్ని సందర్శించడంతో పాటు అధికారులతో వివరాలు సేకరించారు. ఈనేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో మరమ్మతు కోసం సమగ్ర సర్వేకు అవసరమైన నిధుల మంజూరు అవుతున్నట్లు తెలిసింది.

నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సుమారు రూ.2వేల కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 14ప్యాకేజీలు, రెండు లిఫ్టులు, ఏడు జలాశయాలు నిర్మించారు. సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు స్టాండ్‌బై కింద కేవలం నీటిని నిల్వ చేసుకునేందుకు నిర్మించగా.. మరో 5 జలాశయాలు ఆయకట్టుకు నీరు అందించేలా డిజైన్‌ చేశారు. ఇందులో ర్యాలంపాడు జలాశయం కింద ధరూరు, కేటీదొడ్డి, మల్దకల్‌ మండలాల్లో 1.05లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4టీఎంసీలు. మరోవైపు 1.30టీఎంసీల సామర్థ్యంతో 1.36లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతలకు కూడా అవసరమైన 2.80టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచే ఎత్తిపోసేలా నిర్మాణం చేపడుతున్నారు.

నడిగడ్డలో 2లక్షల ఎకరాలకు..

2022లో రిపోర్ట్‌ అందజేత

సదరు సంస్థ 2022 మార్చిలో సర్వే పనులు చేపట్టి లీకేజీల మరమ్మతుకు సుమారు రూ.137 కోట్లు వ్యయం అవుతుందని 2023 జనవరిలో ఇరిగేషన్‌ శాఖకు రిపోర్ట్‌ అందించారు. అంచనాలు రూపొందించిన అధికారులు తుది నివేదికను 2024 డిసెంబర్‌లో ప్రభుత్వానికి సమర్పించారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ ఇంజినీర్ల నిపుణుల బృందం ర్యాలంపాడును సందర్శించి లీకేజీలను పరిశీలించారు. మరోసారి సర్వే చేసేందుకు రూ.1.86 కోట్లు అవసరం అవుతుందని నిపుణుల బృందం ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీకి వివరించారు. విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించడంతో రెండు, మూడు రోజుల్లో అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఐదేళ్ల క్రితం జలాశయానికి గండి

2024 డిసెంబర్‌లో రూ.137 కోట్ల అంచనాతో నివేదిక

ఏప్రిల్‌లో పూణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ నిపుణుల బృందం సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement