తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి నిత్యం మంగళవారం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకొని పూజలు చేయడంతో ఆలయానికి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పూజల నిర్వహణ ఎక్కడ చేస్తారని దేవాదాయశాఖ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో భక్తులు కలవరపడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటిస్తుండడంతో భక్తులకు పాలుపోవడం లేదు. బుధవారం బాలాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేశారు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు ఆయా బస్టాండ్ పాంతాలు, రద్దీ ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద భక్తులకు, ప్రజలకు తెలిసేలా ఆలయాన్ని మార్చబడిందని, పూజల వివరాలు సూచిక బోర్డులు పెట్టాలని భక్తజనం కోరుతున్నారు.


