కేయూ క్యాంపస్: తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో లెటర్ ఎంట్రీ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా టీజీఈసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. బుధవారం హనుమకొండలోని యూనివవర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ టీజీఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లోని కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవే శం పొందననున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను జ్యోతి అందజేశారు.


