వాజేడు: ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామం వద్ద 163వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్జీ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అధికారులు నిరంతరం విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై పక్కాగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణవేణి, సివిల్ సప్లయీస్ అధికారి సయ్యద్ షా ఫైజల్ హుస్సేన్, తహసీల్దార్ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ విజయ్ కుమార్, వాజేడు డీటీ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ


