ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ

Oct 12 2025 6:35 AM | Updated on Oct 12 2025 6:35 AM

ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ

ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ

ములుగు రూరల్‌: ఏజెన్సీ గ్రామాల్లో శనివారం ఎన్టీపీసీ దక్షిణ విభాగం వారి సహకారంతో దోమతెరల పంపిణీని చేపట్టారు. ఈ మేరకు శనివారం మండల పరిధిలోని సర్వాపూర్‌, అంకన్నగూడెం, పెగడపల్లి పంచాయతీల్లో వెయ్యి కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ చీఫ్‌ జనరల్‌ పాణిగ్రాహి, లయన్స్‌క్లబ్‌ ఫౌండేషన్‌ ఏరియా లీడర్‌ దీపక్‌భట్టాచార్జి, లయన్స్‌ 320ఎఫ్‌ జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆర్యలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ చీఫ్‌ జనరల్‌ పాణిగ్రాహి మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనందిస్తున్నామన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సామాజిక సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎజీఎం అఖిల్‌ పట్నాయక్‌, లయన్స్‌ 320 ఎఫ్‌ వైస్‌ గవర్నర్లు సుధాకర్‌రెడ్డి, హరికిషన్‌, వివేకనందపురం క్లబ్‌ ప్రెసిడెంట్‌ నరేష్‌చంద్రదాస్‌, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ములుగు క్లబ్‌ అధ్యక్షుడు దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డి, ప్రకాశం, పద్మజాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement