సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి

Oct 10 2025 5:54 AM | Updated on Oct 10 2025 5:54 AM

సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి

సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి

సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి

ములుగు రూరల్‌: సమాచార హక్కు చట్టం –2005పై అధికారులు తప్పనిసరిగా పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌, డిప్యూటీ కలెక్టర్‌ కుశీల్‌ వంశీ పాల్గొన్నారు. అనంతరం సమాచార హక్కుచట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా అధికారులతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ ఏఓ రాజ్‌కుమార్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వీసీలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement