
90 రోజుల్లోనే అభివృద్ధి పనులు
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క
సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్న సీతక్క
ఎస్ఎస్తాడ్వాయి: 90 రోజుల్లోనే మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రేపు(మంగళవారం) మేడారానికి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను జిల్లా అధికారులు, పూజారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలోని ఐటీడీఏ గెస్ట్హౌస్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, జిల్లా ఉన్నతాధికారులతో పాటు సమ్మక్క–సారలమ్మ పూజారులతో మంత్రి సీతక్క ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మేడారం పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను సీఎం ఖరారు చేస్తారన్నారు. అనంతరం అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని స్పష్టం చేశారు.
పనుల్లో 2 వేల మంది కార్మికులు
సీఎం రేవంత్రెడ్డి మంగళవారం 12 గంటలకు మేడారానికి చేరుకుని తొలుత అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాస్టర్ ప్లాన్ డిజైన్ పూజారులతో కలిసి సీఎం ఎల్ఈడీ స్క్రీన్పై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన మరుసటి రోజు నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 90 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన సాగుతాయని, ఈ పనుల్లో 2వేల మంది కార్మికులు పాల్గొనున్నట్లు వివరించారు.
మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
వనదేవతలపై సీఎం రేవంత్రెడ్డికి ఉన్న భక్తి విశ్వాసంతో మేడారం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి జాతరకు ముందుస్తుగా మేడారానికి వస్తున్నారని తెలిపారు. గద్దెల ప్రాంగణంలో పనులు చేస్తున్న సమయంలో పూజారులు వెంట ఉండి ఏమైనా చిన్నచిన్న చేర్పులు మార్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమానికి అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. గద్దెల ప్రాంగణం విస్తీర్ణంతో పాటు మేడారం పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు కూడా అంతే వేగంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. 28 జనవరి 2026 నుంచి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సంపూర్ణంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క ఉదయం 10 గంటలకు మేడారానికి చేరుకుని పర్యవేక్షించారు. సీఎం హెలీపాడ్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే మార్గాన్ని ఎండోమెంట్ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, అధికారులు పాల్గొన్నారు.
ఎల్ఈడీ స్క్రీన్పై మాస్టర్ ప్లాన్ డిజైన్ ఆవిష్కరించనున్న సీఎం
సీఎం వచ్చి వెళ్లిన మరుసటి
రోజు నుంచే పనులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

90 రోజుల్లోనే అభివృద్ధి పనులు