
కలెక్టర్ సుడిగాలి పర్యటన
వాజేడు: నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాజేడు, వెంకటాపురం(ఎం) మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ దివాకర సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పర్యటనలో చేపట్టనున్న ఆభివృద్ధి పనులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు మంత్రి శ్రీనివాసరెడ్డి వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం, నాగారం, ఎడ్జర్లపల్లి, వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాత్రాపురం, వెంకటాపురం గ్రామాల్లో పర్యటించి పలు ఆభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఆశవర్కర్ల సమ్మె నోటీసు
అందజేత
ములుగు రూరల్: ఈ నెల 20వ తేదీన జాతీయ, రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ మహేందర్, డీఎంహెచ్ఓ గోపాల్రావుకు ఆశ వర్కర్లు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రవిగౌడ్, నీలాదేవి, మంజూల, రజిత, కవిత, రమాదేవి, సుధా, కోమల, సంధ్య పాల్గొన్నారు.

కలెక్టర్ సుడిగాలి పర్యటన