
మొరం తవ్వకాలు నిలిపేయాలి
రేగొండ: మండలంలోని రావులపల్లిలో లంబాడి కుంటలో మొరం అక్రమ తవ్వకాలను నిలిపేయాలని రావులపల్లి ఎస్సీ కాలనీవాసులు తహసీల్దార్ శ్వేతకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా కొంత మంది వ్యక్తులు మొరాన్ని అక్రమంగా అమ్ముకుంటూ చెరువు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. చెరువులో భారీ గుంతలు తీయడంతో ప్రమాదాలు సంభవించే అవకాశముందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండెల రవి, రత్న మల్లయ్య, మేకల పోషాలు, పెండెల చిరంజీవి, మేకల రాజు, రత్న మధు, మేకల శివ, తదితరులు పాల్గొన్నారు.