
బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్
కన్నాయిగూడెం: నూతన తహసీల్దార్గా సర్వర్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని తహసీల్దార్గా పనిచేసిన వేణుగోపాల్ బదిలీపై వెంకటపురం (కె) మండలానికి వెళ్లగా కన్నాయిగూడెం తహసీల్దాగా సోమవారం సర్వర్ బాధ్యతలు చేపట్టారు.
అయోడిన్పై అవగాహన
వాజేడు : మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో సోమవారం పేరూరు వైద్య సిబ్బంది అయోడిన్ వలన కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ఈ ఓ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ మనిషి శరీరంలో ఉప్పుశాతం తగ్గితే ఆరోగ్య పరంగా ఎలాంటి రుగ్మతలు వస్తాయో తెలిపారు. అదే సమయంలో తక్కువగా ఉంటే కలిగే నష్టాలను వివరించారు. మనిషికి ఉప్పు ఎంత అవసరమో వివరంగా తెలిపారు.
ఆర్థికసాయం
ఏటూరునాగారం : మండలంలో బాస రాములు, వావిలాల రాధిక, దబ్బగట్ల భాస్కర్ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు వారి నాయకులతో ఒక్కో కుటుంబానికి సోమవారం రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలి పారు. ఆయన వెంట గడదాసు సునీల్కుమార్, తుమ్మ మల్లారెడ్డి, ప్రదీప్రావు, గోవింద్నాయక్ ఖాజాపాషా, తాడూరి రఘు, కాకులమర్రి భాస్కర్రావు, వావిలాల పోశయ్య, నాగరాజు, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
కమిటీ ఎన్నిక
టేకుమట్ల: మండలంలోని మందలోరిపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీని సోమవారం మండల అధ్యక్షుడు కోటగిరి సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జెల్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా బూర్గుల కొమురయ్య, ఉపాధ్యక్షుడి బండి రాజారాంను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపెల్లి వీరేశం, తదితరులు ఉన్నారు.
కొత్తపల్లి(ఎస్ఎం)లో..
భూపాలపల్లి రూరల్: మండలంలోని కొత్తపల్లి(ఎస్ఎం) కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు పార్టీ గ్రామ ఇన్చార్జ్లు రఘునాథరె డ్డి, సంపత్రావు తెలిపారు. అధ్యక్షుడిగా అజ య్, ఉపాధ్యక్షుడిగా విష్ణు, నదీం, ప్ర ధాన కార్యదర్శిగా పాలిత రాజును ఎన్నుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఆరుగురిపై కేసు నమోదు
ములుగు : ములుగు మార్కెట్ రోడ్డులోని పైడిమల్ల మొగిలి ఇంటి పక్కన కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు ఎస్సై వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న దొంతి రవి, వలపదాసు శ్రీధర్, ఎండీ పాషా, శ్రీరాం రవి, రాయల ప్రకాశ్, పైడిమల్ల మొగిలిలను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 92 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని అన్నారు.
అభినందన
భూపాలపల్లి రూరల్: ఏయిమ్స్ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పీజీ ఎంట్రెన్స్ 2025 ఫలితాలలో పట్టణానికి చెందిన ఎంపటి కుశ్వంత్ ఆల్ ఇండియా తొ మ్మిదో ర్యాంకు సాధించాడు. సోమవారం బీసీ సంఘం నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో కుష్వంత్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి చిన్నప్పుడే మృతి చెందిన తల్లి అనిత మిషన్ కుట్టుకుంటూ ఇద్దరి బాబులను చదివించారన్నారు. 2019లో ఎంబీబీఎస్ సీటు సాధించినప్పుడు సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కుష్వంత్కు ఆర్థిక సాయం చేసి ఎంబీబీఎస్ పూర్తయ్యేందుకు సహకరించినట్లు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్

బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్