
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కాటారం: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో నెల రోజులుగా అథ్లెటిక్ శిబిరం నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్న జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులకు సోమవారం అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ పులిహోర, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. ప్రతీ క్రీడాకారుడు క్రీడా నైపుణ్యతను పెంపొందిచుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.