
అన్నదానం చేయడం అభినందనీయం
భూపాలపల్లి రూరల్: కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం అన్నదాన శిబిరంలో పాల్గొన్ని భక్తులకు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నదానానికి సహకరించిన దాతలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్ణణ పరిధిలోని వేశాలపల్లిలో ఏర్పాటు చేసిన జైబాపు,జైభీం, జైసంవిధాన్ కార్యక్రమంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, ఆకుల మహేందర్, రాంనేని రవీందర్. తోట రంజిత్, ముంజాల రవీందర్, గురిజాల రవి పాల్గొన్నారు.