ఆ హిట్‌ ఫ్రాంచైజీలోకి త్రిష.. జోడీ కుదిరిందా?

venkatesh and trisha are pairing up for anil ravipudis film - Sakshi

హీరో వెంకటేశ్, హీరోయిన్‌ త్రిష నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. వీరిద్దరూ గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమో వెంకటేశ’(2010), ‘బాడీగార్డ్‌’(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ హిట్‌ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లతో ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి సినిమాలు తీసి, హిట్‌ అందుకున్నారు అనిల్‌ రావిపూడి.

ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్‌ 4’ సినిమా ఉంటుందని ‘ఎఫ్‌ 3’ క్లైమాక్స్‌లో హింట్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌. ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ సినిమాలు నిర్మించిన ‘దిల్‌’ రాజే తాజాగా వెంకీ–అనిల్‌ కాంబినేషన్ లో మూడో సినిమా నిర్మించనున్నారట.  ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంటే.. దాదాపు పుష్కరకాలం తర్వాత వెంకటేశ్‌–త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్‌తో అనిల్‌ రావిపూడి తెరకెక్కించేది ‘ఎఫ్‌ 4’ సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top