ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత? | NTR–Prashanth Neel Movie: Fake News on Project Halt Goes Viral | Sakshi
Sakshi News home page

Prashanth Neel - Jr ntr: ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమేంటి?

Oct 22 2025 3:45 PM | Updated on Oct 22 2025 4:03 PM

 Prashanth Neel and jr ntr movie shoot stopped for this reason goes viral

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్‌నీల్‌ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్‌ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్‌ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్‌ కానీ.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 

దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్‌ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement