'ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై తప్పుడు ప్రచారం' | Prashanth Neel And JR NTR Movie NTRNeel only single part | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై తప్పుడు ప్రచారం'

Nov 3 2025 1:25 PM | Updated on Nov 3 2025 1:45 PM

Prashanth Neel And JR NTR Movie NTRNeel only single part

జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై మధ్య చాలా రూమర్స్వస్తూనే ఉన్నాయి. మూవీ షూటింగ్ఆగిపోయిందని కొద్దిరోజులుగా ప్రచారం అయింది. అయితే, మూవీ రెండు భాగాలుగా రానుందని సోషల్మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. 'డ్రాగన్' పేరుతో తెరకెక్కుతున్న మూవీని మొదట ఒకే భాగంగా నిర్మించాలని మేకర్స్ అనుకున్నారట.. కానీ, రన్టైమ్ఎక్కువ రావడంతో రెండు పార్ట్స్‌గా విడుదల చేసేందుకు వారు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని ప్రశాంత్నీల్టీమ్తాజాగా ఒక పోస్ట్చేసింది.

దర్శకుడు ప్రశాంత్నీల్ఇప్పటికే కేజీఎఫ్ చిత్రాలను రెండు భాగాలుగా నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. సలార్మూవీని కూడ రెండు పార్ట్స్గా విడుదల చేస్తామని తెలిపారు. ఇదే క్రమలో తారక్సినిమాను కూడా సీక్వెల్ప్లాన్‌చేసే పనిలో ఉన్నారని ఒక వార్త ట్రెండ్అయింది. అయితే, తాజాగా ప్రశాంత్నీల్టీమ్ఖండించింది. ' #NTRNeel సినిమా రెండు భాగాలుగా ఉంటుందని వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. ప్రాజెక్ట్ ఒకే భాగంగా వస్తుంది. ఇదీ చాలా శక్తివంతమైన కథ . భారీ హిట్ కొట్టేలా రూపొందించబడింది. కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల కానుంది.' అంటూ ప్రశాంత్టీమ్పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement