2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది నితిన్కి దక్కట్లేదు. గతేడాది వచ్చిన 'తమ్ముడు' మూవీ ఘోరమైన డిజాస్టర్ అయ్యేసరికి లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. ఎట్టకేలకు కొత్త చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేశాడు. బుధవారం ఉదయం హైదరాబాద్లో పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. నారి-సోము దర్శకులుగా పరిచయమవుతున్నారు. నితిన్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా చేస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ మొదలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్కి ఊహించని అవకాశం?)


