పనిమనిషి ఇంతపని చేసిందా.. నటిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు

Namita Thapar says househelp posted hateful story from her phone - Sakshi

బాలీవుడ్ నటినమితా థాపర్ తన ఫోన్ చోరీకి గురైనట్లు వెల్లడించింది. నా ఫోన్ చోరీ చేయడమే కాకుండా ద్వేషపూరిత కథనాన్ని పోస్ట్ చేశారని తెలిపింది. తన ఇంట్లో పనిమనిషి మొబైల్ దొంగిలించి ఇలా చేసిందని వాపోయింది. సోషల్ మీడియాలో నాపై కావాలనే ఇలా చేసిందని పేర్కొంది నటి. 

నమితా తాపర్ షార్క్ ట్యాంక్ అనే రియాల్టీ షోతో ఫేమస్ అయ్యారు. నమితా థాపర్ ఫోన్ దొంగిలించిన పని మనిషి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ద్వేషపూరిత పోస్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన నమితా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫోన్ ఇప్పుడు రికవరీ చేయబడిందని.. ఆందోళనతో ఫోన్ చేసిన స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసింది.

అయితే ఆమె వివరణతో కొంతమంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. ఇది నిజంగా ఆమె కొడుకు ద్వారా పోస్ట్ చేశారా..లేక నమితా థాపర్ కావాలనే పనిమనిషిని నిందిస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. షార్క్ ట్యాంక్ ఇండియా అనేది ఒక రియాలిటీ షోలో నమితా థాపర్‌తో పాటు.. ప్యానెల్‌లో అనుపమ్ మిట్టల్, వినీతా సింగ్, అమన్ గుప్తా, పీయూష్ బన్సాల్, మరో కొత్త నటుడు అమిత్ జైన్ కూడా ఉన్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 సోనీ టీవీ, సోనీలైవ్‌లో ప్రసారమవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top