మంచు మనోజ్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నాడు. నిర్వాహకుల అభ్యర్థన మేరకు రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమానికి కావాల్సిన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా అందజేశారు. అంతేకాదు అక్కడున్నవారందరికీ కొత్త దుస్తులను కూడా పంపిణీ చేశాడు.
అలాగే ఓ మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు మనోజ్. సెలెబ్రెటీని అనే ఫీలింగ్ లేకుండా సామాన్య వ్యక్తిగా వెళ్లి.. అతనికి కటింగ్ చేశాడు. ఈ సందర్భంగా అతని పేరు కూడా అడిగి తెలుసుకున్నాడు. అతనికి పేరు తప్ప ఇంకేమి గుర్తు లేదని నిర్వాహకులు చెప్పడంతో.. ‘పేరు చాలా బాగుంది’ అంటూ కటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
కాగా, మనోజ్ ఇప్పటికే ఈ మధ్యే తన సతీమణితో కలసి ఐక్య అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానంతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సొంత డబ్బుతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Manchu Manoj Emotional Service 😍 | Helping Orphans on Roadside Viral Video#ManchuManoj #TeluguNews #ViralVideo #Humanity #HelpingHands #SocialService #HeartTouching #InspiringStory #GoodDeeds #Orphans #TeluguCinema #BRKNews pic.twitter.com/W9vzabUkzb
— BRKNews (@BRKTelugu_1) May 26, 2026


