మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది.
జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది.


