దృశ్యం 2: అజయ్‌ కూడా తప్పించుకుంటాడు

Drishyam 2 Hindi Remake Rights May Bring Back Ajay Devgn - Sakshi

‘దృశ్యం2’ హవా మొదలైంది. తెలుగులో వెంకటేశ్‌తో ఈ సినిమా రీమేక్‌ అధికారికంగా అనౌన్స్‌ అయ్యింది. మలయాళ ఒరిజినల్‌ను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా దీనివార్తలు మొదలయ్యాయి. ‘దృశ్యం’ హిందీ వెర్షన్‌లో అజయ్‌ దేవ్‌గణ్, టబూ, శ్రేయ నటించారు. దృశ్యం2 హిట్‌ అవడంతోటే హిందీలో కూడా రీమేక్‌ పనులు మొదలయ్యాయి. అజయ్‌ దీనికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తారు. దృశ్యంలో నటించినవారే ఇందులో కూడా నటించే అవకాశాలున్నాయి.

అయితే ‘దృశ్యం’కు దర్శకత్వం వహించిన నిషికాంత్‌ కామంత్‌ గత సంవత్సరం సిరోసిస్‌తో మరణించడంతో ఈసారి హిందీ వెర్షన్‌కు జీతూ జోసఫ్‌నే అజయ్‌ తీసుకోనున్నాడని వినికిడి. తెలుగు రీమేక్‌ను పూర్తి చేసుకుని జీతూ హిందీ రీమేక్‌కు వెళ్లొచ్చు. కనుక మలయాళంలో మోహన్‌లాల్‌ శిక్ష తప్పించుకున్నట్టే తెలుగులో వెంకటేశ్‌ తప్పించుకోనున్నాడు. అజయ్‌ కూడా తప్పించుకోనున్నాడు. చూడాలి... ఈ రీమేక్స్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో.

చదవండి:  దృశ్యం 2: కుటుంబం గెలిచింది

చదవండి:   రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top