పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు | Chiranjeevi wishes to padma awards winners | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు

Jan 26 2026 11:55 AM | Updated on Jan 26 2026 1:01 PM

Chiranjeevi wishes to padma awards winners

కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌ అవార్డ్‌ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్‌ దక్కడం సంతోషంగా ఉందని చిరు పేర్కొన్నారు.   ప్రియమైన నటుడు మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు  పద్మ భూషణ్ అవార్డ్‌ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రియమైన మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, మన ఛాంపియన్ రోహిత్ శర్మ, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్ ప్రీత్‌లు  పద్మశ్రీని అందుకోవడం  అభినందనీయం అన్నారు. కళలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడల రంగాలలో విశేష కృషి చేసిన 2026 పద్మ అవార్డు గ్రహీతలందరికీ  హృదయపూర్వక అభినందనలు అంటూ చిరు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement