రహదారులు అనుసంధానిస్తాం | - | Sakshi
Sakshi News home page

రహదారులు అనుసంధానిస్తాం

Apr 4 2026 8:55 AM | Updated on Apr 4 2026 8:55 AM

రహదారులు అనుసంధానిస్తాం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌: ఖేడ్‌ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత రోడ్ల అనుసంధానంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్‌ మండలం మూడుగుంటల్‌ జాతీయ రహదారి నుంచి సంజీవన్‌రావుపేట, కడ్పల్‌, సిర్గాపూర్‌ మీదుగా గౌడ్గాం వద్ద ఖేడ్‌–కంగి రోడ్డును అనుసంధానిస్తూ రూ.21 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్‌ నుంచి సిర్గాపూర్‌, కంగ్టిలకు వెళ్లడానికి దగ్గరి రోడ్డుగా ఉండి వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఖేడ్‌ పట్టణం ఏఎస్‌ నగర్‌ కాలనీలోని రాజరాజేశ్వరి శివాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement