
రెండెకరాలు ఎండిపోతుంది
రాయినిపల్లి ప్రాజెక్టు కింద 2 ఎకరాల్లో వరి వేశాను. ఇందుకోసం రూ. 22 వేల పెట్టుబడి పెట్టాను. భారీ వర్షాలకు కాలువలు తెగిపోయాయి. ఇప్పటికే నీటి తడులు లేక 10 రోజులు అవుతుంది. పొలం ఎండిపోతుంది.
– పోచయ్య, రైతు రాయినిపల్లి
ప్రతిపాదనలు పంపుతాం
కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రెండు రకాల ప్రతిపాదనలు పంపిస్తాం. ఒకటి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పంటలకు సాగునీరు అందించడానికి, మరోటి శాశ్వత మరమ్మతుల కోసం పంపిస్తాం.
– రఘునాథ్రావు, ఎస్ఈ ఇరిగేషన్