సార్‌ సేవలకు ఇరవై ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

సార్‌ సేవలకు ఇరవై ఏళ్లు

Sep 5 2025 8:32 AM | Updated on Sep 5 2025 8:32 AM

సార్‌ సేవలకు ఇరవై ఏళ్లు

సార్‌ సేవలకు ఇరవై ఏళ్లు

శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
పిల్లల మధ్యే విశ్రాంత జీవితం

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): పదవీ విరమణ పొందిన చాలా మంది శేష జీవితం పొందుతారు. కానీ రిటైర్డు ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డి మాత్రం పిల్లల మధ్యే జీవితం సాగిస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌ గ్రామానికి చెందిన తొందూరు బాల్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా 34 ఏళ్లు పనిచేశారు. 2004లో రిటైర్డు అయ్యారు. అయినా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఏడేళ్ల పాటు ప్రయివేట్‌ పాఠశాలలో పనిచేశారు. అనంతరం గజ్వేల్‌ మండలం దాచారం ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో మూడేళ్లు, క్యాసారం పాఠశాలలో రెండేళ్లు, ప్రజ్ఞాపూర్‌ పాఠశాలలో ఏడాది, తిగుల్‌ ప్రాఽథమిక పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. తెలుగు, గణితం పిల్లలకు బోధిస్తున్నారు. బాల్‌రెడ్డి సేవలకు జిల్లా విద్యాశాఖ అధికారులు, మాజీ మంత్రి హరీశ్‌రావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులు పిల్లలకు పాఠాలు చెబుతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement