
కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
నర్సాపూర్/వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): కల్తీ కల్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫా హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులుగా సర్కిల్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్చెడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టామ ని వివరించారు. చిలప్చెడ్ మండలంలోని రహీంగూ డ తండాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా కొనసాగుతున్న కల్లు దుకాణంలో తనిఖీలు చేసి కల్లును పారపోసి కేసు నమోదు చేశామన్నారు. కల్లు దుకాణం నిర్వాహకుడు తమను చూసి పారిపోయాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. పలు కల్లు దుకాణాల నుంచి షాంపిల్స్ సేకరించామని, వాటిని లేబొరేటరీకి పంపుతామన్నారు. వైన్ షాపులలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎకై ్సజ్ ఎస్ఐ రాఘవేందర్రావు, చిలప్చెడ్ ఎస్ఐ నర్సింలుతో పాటు సిబ్బంది ఉన్నారు. అలాగే వెల్దుర్తి మండలంలోని పలు కల్లు దుకాణాలను రామాయంపేట ఎకై ్సజ్ సీఐ నరేందర్రెడ్డి తనిఖీ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కల్లు డిపోలను పోలీసులు తనిఖీ చేశారు.