తక్షణ పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

తక్షణ పరిష్కారం చూపండి

Jul 16 2024 10:14 AM | Updated on Jul 17 2024 8:42 AM

తక్షణ పరిష్కారం చూపండి

తక్షణ పరిష్కారం చూపండి

మెదక్‌ కలెక్టరేట్‌: అధికారులు జవాబుదారీగా విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. రానున్న ప్రజావాణిలో అన్నిశాఖల అధికారులు తమ శాఖలో ఉన్న పెండింగ్‌ అర్జీల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా ధర ణి, పెన్షన్లు, డబుల్‌బెడ్రూం, ఉపాధి కల్పించాలంటూ పలువురు వినతులు సమర్పించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే మూడు వారాలుగా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ప్రజావాణికి వినతుల వరద కొనసాగుతూనే ఉంది. మూడు వారాల క్రితం 206 అర్జీలు రాగా రెండు వారాల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వందకు తగ్గకుండా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.

● మా నాన్న చనిపోయి 9 ఏళ్లు అవుతుంది. ఆయన పేరున ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమి నా పేరు మీదకు మార్చాలని వేడుకుంటున్నా. తొమ్మిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ఆ భూమి నాపేరు మీదకు మార్చేలా చూడాలని హవేళిఘనాపూర్‌ మండలం తిమ్మాయిపల్లికి చెందిన తలారి సిద్దిరాంలు వేడుకున్నాడు.

● మా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అమృత సిస్టమ్స్‌ ప్రైవేట్‌ కెమికల్‌ కంపెనీ నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయంలో విచారణ జరిపి వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి కాలుష్య సమస్య ఏర్పడకుండా చూడాలని కౌడిపల్లి మండలం పాంపల్లికి చెందిన గ్రామస్తులు కోరారు.

● సొంత ఇల్లు లేక ఏళ్ల తరబడి కిరాయి ఇళ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికీ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా డబుల్‌బెడ్రూం మంజూరు కాలేదు. ఇప్పటికై నా మంజూరు చేయాలని మెదక్‌ మండలం అజంపురాకు చెందిన సకీనాబేగం విజ్ఞప్తి చేశారు.

అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

ప్రజావాణికి 144 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement