నిర్మల్రూరల్: ఇంటర్ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని అల్ఫోర్స్ బాలికల కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ముగ్గురు విద్యార్థులు రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. 470 మార్కులకు గాను జి.అక్షర, డి.వినీష 469 మార్కులు సాధించారు. ఎం.చైతన్య, ఆప్షన్ మహివీణ్ 468 మార్కులు, ప్రథమ సంవత్సరం బైపీసీలో ఖాన్స అలియా, ఎస్.జాగతి, హర్షిత 439 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. మీరాబు ఇఫ్తేకర్, హజర కునైన్ 438 మార్కులు, ద్వితీయ సంవత్సరం 1000 మార్కులకు గాను బైపీసీలో నబేలా తహ్రిం, కె.హారిక 995 మార్కులు, శివాని 994, త్రిపుర 994 మార్కులు సాధించారు. వీరిని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ అనిల్, అధ్యాపకులు అభినందించారు.
గురుకుల విద్యార్థుల హవా
ఉట్నూర్రూరల్: ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు ఉత్త మ ఫలితాలు సాధించినట్లు రీజినల్ కోఆర్డినేటర్ అగస్టీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రథమ సంవత్సరం 77.65 శాతం ఉత్తీ ర్ణత నమోదైంది. టాపర్స్గా సీహెచ్.అనూష (ఆసిఫాబాద్) 474, ఎం.అర్చన (సిర్పూర్(టి) 434, రాథోడ్ మీనా (బుగ్గారం) 475, ఎ. హా రిక (ఉట్నూర్)482 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 88.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టాపర్లుగా జి.సంజన (ఇంద్రవెల్లి)970, డి. సంజన (ఇచ్చోడ)970, వై.రాధిక (సిర్పూర్(టి)988, బి. సుజాత (ఉట్నూర్)966, ఆర్. నందిని (బుగ్గారం)915 మార్కులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.
‘ఆత్మీయ’ సమ్మేళనం


