పట్నం బాట పటిన పల్లె
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణం కావడంతో సోమవారం మంచిర్యాల బస్స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆదివారం నాటితో సెలవులు ముగియగా చదువు, ఉద్యోగరీత్యా వెళ్తుండడంతో ఎటు చూ సినా రద్దీ కనిపించింది. పండుగకు వచ్చినవారందరూ ఆదివారం అమావాస్య కావడంతో సోమవా రం బయల్దేరారు. హైదరాబాద్ బస్సు వస్తే చాలు ప్రయాణికులు సీట్ల కోసం పాట్లు పడాల్సి వచ్చింది. హైదరాబాద్కు వెళ్లే బస్సుల్లో ముందస్తు రిజిర్వేషన్లతో సీట్లు నిండిపోయాయి. రోజువారీ బస్సులకు అదనంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరో 20 బస్సు సర్వీసులు నడిపించినట్లు మంచిర్యాల డీఎం శ్రీనివాసులు తెలిపారు.


