A…«§ýl E´ë-«§éÅ-Ķæ¬yìl ˘ దొరకని ఆచూకీ
కడెం: కరీంనగర్కు చెందిన అంధ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్రెడ్డి శనివారం కడెం ప్రాజెక్ట్లో దూకి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి రాత్రివరకు ఎస్సై పి.సాయికిరణ్, సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. మధ్యాహ్నం కడెం ప్రాజెక్ట్ వరద గేటు ఎత్తారు. బ్యాక్వాటర్లో నుంచి గేటు బయటకు వెళ్లి ఉంటాడా, లేదా బురదలో తట్టుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా రాజశేఖర్రెడ్డి మనస్తాపంతో కడెం ప్రాజెక్ట్లో దూకి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
